Thursday, March 28, 2024

ఇజ్రాయెల్ లో ప్రార్థనా మందిరం కూలి ..ఇద్దరి మృతి, 160 మందికి పైగా గాయాలు..

ఇజ్రాయెల్ లోని ఆక్రమిత వెస్ట్ బ్యాంకులో ఉన్న ప్రార్థనా మందిరం కూలిపోయిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు చనిపోగా… 160 మందికి పైగా గాయపడ్డారు. మతపరమైన ‘షావూత్ ఫీస్ట్’ కార్యక్రమాన్ని పురస్కరించుకుని వేలాది మంది ఈ మందిరానికి చేరుకున్నారు. అయితే ఈ సందర్భంగా ఈ భవనం కోసం నిర్మించిన రెండు స్టాండ్లు కూలిపోవడంతో… అక్కడ నుంచి బయటపడేందుకు జనాలు ఒకరినొకరు తోసుకున్నారు. ఈ సందర్భంగా తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 40 ఏళ్ల వ్యక్తితో పాటు, 12 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. గాయపడిన వారిని ఇజ్రాయెల్ భద్రతా బలగాలు ఆసుపత్రులకు తరలించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement