Friday, April 19, 2024

అయోధ్యలో అర్జునుడు -మహేశ్ బాబు మూవీ టైటిల్ ఇదేనా..!

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ కి అ అనే పదాన్ని తన చిత్రాలకి టైటిల్స్ గా పెడుతుంటారు. కాగా చాలా ఏళ్ల తర్వాత సూపర్ స్టార్ మహేశ్ బాబు తో సినిమా చేయనున్నాడు త్రివిక్రమ్. ఈ చిత్రానికి సంబంధించి తాజాగా ఆసక్తికరమైన వార్త బయటికి వచ్చింది. దీనికి ‘అయోధ్యలో అర్జునుడు’ అనే టైటిల్‌ ఖరారు చేసినట్టు తెలుస్తోంది. త్రివిక్రమ్‌కి ‘అ’ సెంటిమెంట్‌ ఉంది. తన చిత్రాలకు ‘అ’ అక్షరంతో మొదలయ్యే పేర్లు పెడుతుంటారు. మహేష్ తో తీసిన అతడు, జూనియర్ ఎన్టీఆర్ తో అరవింద సమేత, నితిన్ తో అ ఆ, అల్లు అర్జున్ తో అల వైకుంఠపురముతో భారీ హిట్స్ సాధించి పెట్టాడు త్రివిక్రమ్. ఇప్పుడు కూడా తన సెంటిమెంట్ ప్రకారం మహేష్ తాజా చిత్రం కోసం అ అక్షరం సెంటిమెంట్ రిపీట్ చేయాలని చూస్తున్నారు. ఇప్పుడు ఒకటి కాకుండా రెండు ‘అ’ లు వచ్చేలా ‘అయోధ్యలో అర్జునుడు’ అనే టైటిల్ పెట్టినట్టు తెలుస్తోంది. ఈ సినిమా పూర్తిగా త్రివిక్రమ్ మార్క్‌తో ఉండే ఈ యాక్షన్ ఎంటర్‌‌టైనర్‌‌లో అని సమాచారం. ఇందులో మహేష్‌ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌‌గా కనిపిస్తాడరట. హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తోంది. బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్యా పాండే తో ఓ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేశారని సమాచారం.ఇప్పటికే ఓ షెడ్యూల్ కూడా పూర్తయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement