Thursday, April 25, 2024

టీమిండియా తదుపరి కెప్టెన్‌ పాండ్యానేనా!

టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాపై పాకిస్తాన్‌ క్రికెట్‌ దిగ్గజం వసీం అక్రమ్‌ ప్రశంసలు కురిపించారు. టీమిండియా తదుపరి కెప్టెన్‌ ఆయనే అంటూ జోస్యం చెప్పారు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్‌ కప్‌లో టీమిండియా శుభారంభం చేసిన విషయం తెలిసిందే. పాకిస్తాన్‌తో జరిగిన సూపర్‌-12 మ్యాచ్లో భారత్‌ 4 వికెట్ల తేడాతో నెగ్గింది. ఈ విజయంలో విరాట్‌ కోహ్లీ, హార్దిక్‌ పాండ్యా కీలక పాత్ర పోషించారు. హార్దిక్‌ పాండ్యా బ్యాటింగ్‌లో 40 పరుగులు చేయడమే కాదు, అంతకు ముందు బౌలింగ్‌లో 3 వికెట్లు తీసి సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో పాండ్యాపై పాకిస్తాన్‌ క్రికెట్‌ దిగ్గజం వసీం అక్రమ్‌ ప్రశంసల వర్షం కురిపించాడు.

టీమిండియా తదుపరి కెప్టెన్‌ పాండ్యానే అని పేర్కొన్నాడు. భవిష్యత్తులో భారత జట్టు పగ్గాలు అందుకునే అన్ని లక్షణాలు అతడిలో ఉన్నాయని కొనియాడారు. ఐపీఎల్‌ ద్వారా తొలిసారి కెప్టెన్సీ చేపట్టిన పాండ్యా అద్భుతంగా రాణించి తన జట్టుకు టైటిల్‌ అందించాడని అక్రమ్‌ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇప్పడు పాండ్యా టీమిండియాలో కీలక ఆటగాడిగానే కాకుండా, కెప్టెన్‌కు సలహాలు ఇవ్వగల సత్తా ఉన్నవాడని, జట్టు గెలుపోటములపై అతడి ప్రభావం కూడా ఉంటుందని పేర్కొన్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement