Tuesday, March 26, 2024

IPL: ఇవాళ రెండు కీలక మ్యాచ్‌లు..

ఐపీఎల్‌లో ప్లే ఆఫ్ కోసం జట్లన్ని కృషి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ రెండు కీలక మ్యాచ్‌లు జరగనున్నాయి. అబుదాది వేదికగా చెన్నై సూపర్ సింగ్స్‌తో, కోల్‌కతా నైట్ రైడర్స్ ఢీ కొట్టనుండగా…రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ మధ్య దుబాయి వేదికగా మ్యాచ్ జరగనుంది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న చెన్నై ఈ మ్యాచ్ గెలిచి ఫ్లే ఆఫ్‌కు మరింత చేరువ అయ్యేందకు ప్రయత్నిస్తుంది. గత మ్యాచ్‌లో ఓటమి పాలైన కోల్‌కతా ఈ సారి ఎలగైనా గెలవాలనే పట్టదలతో ఉంది. ఇక ముంబై, బెంగుళూరు చెరో 8 పాయింట్లతో ఉండగా…ఫ్లే ఆఫ్‌ ఆశలు సజీవంగా ఉంచుకునేందుకు రెండు టీంల మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. కాగా.. నిన్న సాయంత్రం జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ జట్టు పై పంజాబ్ కింగ్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఇది కూడా చదవండి: పవన్ కంటే సన్నాసి ఎవరూ లేరు: వెల్లంపల్లి..

Advertisement

తాజా వార్తలు

Advertisement