Sunday, March 24, 2024

IPL నిరవధిక వాయిదా

కరోనా సమయంలోనూ ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులను అలరిస్తున్న ఐపీఎల్ చివరికి ఆ కరోనా కారణంగానే ఆగిపోయింది. కరోనా కేసులు రోజుకు పెరుగుతుండటంతో బిసిసిఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కొలకత్తా, చెన్నై ఆటగాళ్లు..సిబ్బంది కొందరు కరోనా బారిన పడ్డారు. తాజాగా సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు వృద్ధిమాన్ సాహాకి కరోనా సోకింది. ఐపీఎల్ జట్లలో పలువురు ఆటగాళ్లు కరోనా బారినపడుతుండడంతో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సీజన్ కు ఐపీఎల్ ను నిలిపివేస్తున్నట్టు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వెల్లడించారు.

ఇప్పటివరకు తాజా సీజన్ లో 29 మ్యాచ్ లు జరగ్గా, మిగిలిన మ్యాచ్ లన్నింటినీ ముంబయిలోనే జరపాలని ప్రతిపాదనలు వస్తున్నాయి. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. కాగా, ముంబయిలో ఐపీఎల్ పోటీల రద్దు/వాయిదా కోరుతూ దాఖలైన పిటిషన్ పై విచారణ చేపట్టేందుకు బాంబే హైకోర్టు అంగీరించింది. సెకండ్ వేవ్ కారణంగా కరోనా విజృంభణ, కరోనా కారణంగా నమోదవుతున్న మరణాలను పరిగణనలోకి తీసుకుని ఐపీఎల్ నిలిపివేతకు ఆదేశాలు ఇవ్వాలని, ఇప్పటివరకు జరిగిన నష్టానికి రూ.1000 కోట్ల పరిహారం చెల్లించేలా బీసీసీఐని ఆదేశించాలని ఆ పిటిషన్ లో కోరారు. ఐపీఎల్ లాభాల నుంచి కరోనా చికిత్సలకు, ఆక్సిజన్ కు అయ్యే మొత్తాన్ని రాబట్టాలని విజ్ఞప్తి చేశారు. అటు, ఢిల్లీ హైకోర్టులనూ ఇలాంట పిటిషనే దాఖలైంది. తక్షణమే ఐపీఎల్ పోటీలను నిలిపివేసేలా ఆదేశించాలని ఆ పిటిషన్ లో విన్నవించారు. ప్రజారోగ్యం కంటే ఇలాంటి మ్యాచ్ లకే ఎందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నదానిపై విచారణ చేపట్టాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement