Thursday, April 18, 2024

సెప్టెంబ‌ర్ 19 నుంచి ఐపీఎల్‌-14వ సీజ‌న్ పునఃప్రారంభం..

క‌రోనా కార‌ణంగా వల్ల అర్ధాంతరంగా ఆగిపోయిన ఐపీఎల్ 14వ సీజన్ సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానుంది. గ‌త వారం బీసీసీఐ కార్య‌ద‌ర్శి జై షా ఐపీఎల్ నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న చేశారు. భార‌త క్రికెట్ బోర్డు ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌ను మ‌రోసారి యూఏఈలో నిర్వ‌హించ‌బోతున్న‌ద‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. ఐపీఎల్‌కు సంబంధించి జైషా ఇప్ప‌టికే యూఏఈ సాంస్కృతిక‌, యువ‌జ‌న, సామాజిక అభివృద్ధి శాఖ మంత్రి షేక్ నహ్యాన్‌ను క‌లిసి మాట్లాడారు.

తొలిరోజైన సెప్టెంబ‌ర్ 19న డిఫెండింగ్ చాంపియ‌న్స్ ముంబై ఇండియ‌న్స్‌, చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. నూత‌న షెడ్యూల్ ప్ర‌కారం.. అక్టోబ‌ర్‌ 10న క్వాలిఫ‌య‌ర్ 1, అక్టోబ‌ర్ 11న ఎలిమినేట‌ర్‌ మ్యాచ్‌లు జ‌రుగ‌నున్నాయి. అక్టోబ‌ర్ 13న క్వాలిఫ‌య‌ర్ 2 మ్యాచ్ నిర్వ‌హించ‌నున్నారు. అక్టోబ‌ర్ 15న ఫైన‌ల్ మ్యాచ్ జ‌రుగ‌నుంది. మేం సెప్టెంబ‌ర్ 19న ముంబై ఇండియ‌న్స్‌, చెన్నై సూప‌ర్‌కింగ్స్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్‌తో ఐపీఎల్-14వ సీజ‌న్‌ను పున‌రుద్ధ‌రించ‌నున్నాం. అక్టోబ‌ర్ 10, 13 తేదీల్లో క్వాలిఫ‌య‌ర్ 1, 2 మ్యాచ్‌లు నిర్వ‌హిస్తాం. అక్టోబ‌ర్ 11న ఎలిమినేట‌ర్ మ్యాచ్ జ‌రుగుతుంది. అన్ని మ్యాచ్‌ల‌కు సంబంధించిన ఫుల్ షెడ్యూల్‌ను త్వ‌ర‌లో అన్ని టీమ్‌లకు తెలియ‌జేస్తాం అని బీసీసీఐ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

ఇది కూడా చదవండి: తెలంగాణలో రేపటి నుంచే కొత్త రేషన్ కార్డుల జారీ

Advertisement

తాజా వార్తలు

Advertisement