Wednesday, April 24, 2024

IPl: ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..ఇక పండగే

ఐపీఎల్‌ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పింది. ఐపీఎల్‌ 2021 మ్యాచ్‌ లకు అభిమానులను అనుమతిస్తున్నట్లుగా అధికారిక ప్రకటన విడుదల అయింది. కరోనా మహమ్మారి కారణంగా ఐపీఎల్‌ 2021 కు మధ్య లో బ్రేక్‌ పడిన సంగతి తెల్సిందే. అయతే.. ఈ సీజన్‌ లో మిగిలిన మ్యాచ్‌ లు ఈ నెల 19 నుంచి పునః ప్రారంభం కానున్నాయి. కరోనా మహమ్మారి పరిస్థితులు తగ్గుముఖం పట్టడంతో… ఐపీఎల్‌ మ్యాచ్‌ లకు ప్రేక్షకులను అనుమతించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే… సెప్టెంబర్‌ 16 వ తేదీ నుంచి ఐపీఎల్‌ మ్యాచ్‌ ల టికెట్లు ను ఆన్‌లైన్‌ లో అందుబాటులో ఉంచనున్నారు. అధికారిక వెబ్‌ సైట్‌ www.iplt20.com లో ఐపీఎల్‌ టికెట్లు లభ్యమవుతాయని ప్రకటించింది యాజమాన్యం. కాగా.. సెప్టెంబర్‌ 19 వ తేదీన ముంబై మరియు చెన్నైల మధ్య మొదటి మ్యాచ్‌ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.

ఇది కూడా చదవండి: సోనూసూద్ ఇంటిపై ఐటీ రైడ్స్..

Advertisement

తాజా వార్తలు

Advertisement