Saturday, April 20, 2024

మా కూతురిని వెతికిపెట్టండి సార్.. పోలీసులను వేడుకున్న తల్లిదండ్రులు

వికారాబాద్ (ప్రభ న్యూస్): ఇంటర్మీడియేట్ 2వ సంవత్సరం చదువుతున్న తమ కూతురు కిడ్నప్ కు గురై నాలుగు రోజులు అవుతుందని, దయచేసి తమ కూతురిని వెతికిపెట్టండి అంటూ బాధిత తల్లిదండ్రులు జిల్లా ఎస్పీ కోటిరెడ్డిని వేడుకున్నారు.


ఇంటర్మీడియేట్ 2వ సంవత్సరం శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన బాధితులు, తమ కూతురు కిడ్నాప్ అయ్యి నాలుగు రోజులు అవుతున్నా స్థానిక దోమ పోలీసులు సరైన విచారణ చేయడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే నాలుగు రోజులు గడుస్తున్నా తమ కూతురు ఆచూకీ దొరకడం లేదని బాధిత తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకున్నారు. మహిళా సంఘాల నాయకులు, బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఎస్పీ కార్యాలయం దగ్గరకు చేరుకొని బాధితులకు మద్దతుగా నిలిచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement