Friday, April 19, 2024

మార్చి 15 నుంచి ఇంటర్‌ ఒకేషనల్‌ ఎగ్జామ్స్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ ఒకేషనల్‌ పబ్లిక్‌ ఎగ్జామ్స్‌ను మార్చి 15 నుంచి నిర్వహించనున్నట్లు ఇంటర్‌ బోర్డు ప్రకటించింది. ఇంటర్‌ ప్రథమ సంవత్సరం ఒకేషనల్‌ పరీక్షలు మార్చి 15న, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మార్చి 16న ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంట నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. ప్రాక్టికల్స్‌ పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 2 వరకు జరగనున్నాయి. ఎథిక్స్‌, హ్యూమన్‌ వ్యాల్యూస్‌, ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ పరీక్షలు మార్చి 4, 6 తేదీల్లో జరగనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement