Thursday, April 25, 2024

సెల్‌ఫోన్ కొనివ్వలేదని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలంలో తల్లిదండ్రులు తనకు బైక్, సెల్‌ఫోన్ కొనివ్వలేదని రెడ్డి బాషా అనే 18 ఏళ్ల ఇంటర్ విద్యార్థి విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల మేరకు.. రెడ్డిబాషా స్వగ్రామం మలమీదపల్లి పంచాయతీ అరమడకవారిపల్లి. ఇదే మండలంలోని తూపల్లిలో నానమ్మ హసన్నమ్మ ఒంటరిగా ఉండడంతో ఆమె వద్ద ఉంటూ కదిరిలో ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్‌ చదువుకునేవాడు.

అయితే తనకు బైక్, సెల్‌ఫోన్‌ కావాలని రెడ్డి బాషా తన తండ్రి నబీని అడిగాడు. అయితే ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పడంతో మనస్థాపానికి గురైన రెడ్డిబాషా విషపు గుళికలు మింగాడు. తర్వాత తనే స్వయంగా 108 సిబ్బందికి ఫోన్‌ చేయగా వారు కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అనంతపురం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ రెడ్డిబాషా మృతి చెందాడు.

ఇది కూడా చదవండి: జమ్మూ ఎదురు కాల్పుల్లో బాపట్ల జవాన్ వీరమరణం

Advertisement

తాజా వార్తలు

Advertisement