Saturday, April 20, 2024

హాస్టల్ లో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య !!

తిరుపతి శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. క్యాంపస్ హాస్టల్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే పీలేరు మండలం ఎర్రగుంట గ్రామానికి చెందిన లేటు రామచంద్రరాజు కుమార్తె చరిత్ర వయసు 17 సంవత్సరాలు. తుమ్మలగుంట చైతన్య క్యాంపస్ లో ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతుంది. అయితే మంగళవారం సాయంత్రం ఏం జరిగిందో ఏమోగానీ క్యాంపస్ హాస్టల్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

వెంటనే కాలేజీ యాజమాన్యం రుయా ఆస్పత్రికి తరలించారు.కానీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఇక దీంతో చరిత్ర కుటుంబ సభ్యులు ఎంఆర్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్టు మార్టం నిమిత్తం ఎస్వి మెడికల్ కళాశాలకు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement