Thursday, April 25, 2024

రేపటి నుంచి ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసిన ఇంటర్‌ బోర్డు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: నేటి నుంచి ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ పరీక్షలు జరగనున్నాయి. ఇవి మార్చి 2వరకు కొనసాగనున్నాయి. ప్రాక్టికల్స్‌ ఎగ్జామ్స్‌కు 3.55 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరికోసం 2201 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణకు అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ఇంటర్‌ బోర్డులో ఒక కంట్రోల్‌ రూమ్‌ కూడా ఏర్పాటు చేశారు.

విద్యార్థులకు, కాలేజీ యాజమాన్యాలకు ఎలాంటి సందేహాలు ఉన్నా నేరుగా 040-24600110 నెంబర్‌కు ఫోన్‌ చేసి నివృత్తి చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ కంట్రోల్‌ రూమ్‌ ఈనెల 15 నుంచి మార్చి 2 వరకు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటుందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement