Thursday, March 28, 2024

జూలై లో పది, ఇంటర్ పరీక్షలు…. ఆదిమూలపు సురేష్

ఏపీలో ఇంటర్ పరీక్షల నిర్వహణకు సర్కారు సిద్ధమవుతోంది. దేశంలో అలాగే రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఇంటర్ పరీక్షల నిర్వాహణకు గురువారం సాయంత్రం సీఎం జగన్ సమీక్ష నిర్వహించనున్నారు . కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిందని ఈ నేపథ్యంలోనే జులై ఫస్ట్ వీక్ లో ఇంటర్ పరీక్షలు జూలై చివరి వారంలో పదోతరగతి పరీక్షలు ఉండే అవకాశం ఉందని విద్యాశాఖ మంత్రి సురేష్ ప్రకటించారు.

సీఎం జగన్ తో భేటీ తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని క్లారిటీ ఇచ్చారు . అయితే ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో కరోనా కారణంగా పరీక్షలు రద్దు చేయగా ఏపీలో మాత్రం కరోనా పరిస్థితులు చక్కబడ్డాక పెడతామని రద్దు చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement