Tuesday, April 23, 2024

విజయ్ సాయిరెడ్డి బెయిల్ రద్దుపై విచారణ

ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై నేడు సీబీఐ కోర్టు లో విచారణ జరగనుంది. ఇప్పటికే బెయిల్ రద్దు పై విజయ్ సాయి రెడ్డి కి నోటీసులను న్యాయస్థానం జారీచేసింది. కోర్టు షరతులను ఉల్లంఘించినందున సాయిరెడ్డికి బెయిల్ రద్దు చేయాలని రఘురామ కృష్ణంరాజు పిటిషన్ దాఖలు చేశారు.

పిటిషన్ పై కౌంటరు దాఖలు చేయాలని సీబీఐకి గత విచారణలో న్యాయస్థానం ఆదేశం జారీ చేసింది. నేడు సీబీఐ కౌంటర్ దాఖలు చేయనున్నారు. మరోవైపు విజయ్ సాయి రెడ్డి తరపు న్యాయవాదులు వాదనలు వినిపించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement