Friday, March 29, 2024

చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చితో అమాయకులు బలి : కొడాలి నాని

కృష్ణాజిల్లా : టీడీపీ అధినేత చంద్రబాబుపై ఎమ్మెల్యే కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు యమరథంతో ప్రజలు చంపుతున్నాడని, రెండు సభలతో 11 మందిని బలిగొన్నాడు అన్నారు. పబ్లిసిటీ పిచ్చితో అమాయకులు బలవుతున్నారని, వారు చేసిన నేరాన్ని పోలీసులపై నెడుతున్నారని మండి పడ్డారు. చంద్రబాబు బహిరంగ సభలకు అనుమతి ఇవ్వొదన్నారు. కేసీఆర్‌ ఎక్కడైనా పోటీ చేయొచ్చు కానీ.. ఏపీలో బీఆర్‌ఎస్‌ ప్రభావం ఉండదన్నారు. అంశాల వారీగానే జాతీయ పార్టీలకు వైసీపీ మద్దతు ఉంటుందన్నారు. ఏ పార్టీతోనూ వైసీపీ పొత్తు ఉండదని కొడాలి నాని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement