Friday, March 29, 2024

చిరుత‌కు గాయాలు.. రక్షించిన ఫారెస్ట్ ఆఫీసర్స్..

జమ్ముకశ్మీర్‌ రాష్ట్రంలోని దోడా పట్టణంలో ఓ చిరుతపులి తీవ్ర గాయాలతో కదలలేని స్థితిలో కనిపించింది. వెంట‌నే స్థానికులు అట‌వీ శాఖ అధికారుల‌కు స‌మాచారం అందించారు. అక్కడికి చేరుకున్న ఫారెస్ట్ ఆఫీస‌ర్స్ చిరుతను వలలో బంధించారు. అనంతరం దాన్ని బోనులో వేసుకుని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. ప్రస్తుతం చిరుతపులి ఆరోగ్యం నిలకడగానే ఉందని అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement