Thursday, April 25, 2024

AP | లిఫ్టులో నరకయాతన, క‌ర్నూలు జ్యోతి మాల్ లో పనిచేయని లిఫ్ట్.. అరగంట పాటు జ‌నం ఆగ‌మాగం!

కర్నూలు, (ప్రభ న్యూస్ బ్యూరో) : క‌ర్నూలు నగరం నడిబొడ్డున ఉన్న ఓ ఫేమ‌స్ మాల్‌లో లిఫ్ట్ న‌ర‌క‌యాత‌న పెట్టింది. ప్రముఖ వ్యాపార కేంద్రమైన జ్యోతి మాల్ లో లిఫ్ట్ ప‌నిచేయ‌క చాలామంది అందులో ఇరుక్క‌పోయారు. అర‌గంట పాటు నరకయాతన అనుభవించారు. కర్నూల్ కేంద్రంలోని జ్యోతి మాల్ నిత్యవసరాలతో పాటు వస్త్ర విక్రయాలు, ఇతర వస్తువుల విక్రయానికి ప్రసిద్ధి చెందింది. దీంతో ఈ సెంట‌ర్‌కు పెద్ద సంఖ్య‌లో జనాలు వస్తుంటారు. బుధవారం కొనుగోలు చేయ‌డానికి లిఫ్ట్ ఎక్కిన వారు ఒక్కసారిగా శాఖకు గురయ్యారు. మాల్‌లోని మొదటి అంతస్తుకు చేరకముందే లిఫ్ట్ ఒక్కసారిగా ఆగిపోయింది.

లిఫ్ట్ ఆగిపోయే సమయంలో అందులో ఉన్న జనంలో కొంతమంది కుదుపునకు కింద పడ్డారు. మరికొందరు కేకలు వేశారు. ఈలోగా అక్కడికి చేరుకున్న జ్యోతి మాల్ సిబ్బంది లిఫ్ట్ రిపేర్ చేసే వ్యక్తిని ఫోన్ ద్వారా సంప్రదించారు. అయితే సంబంధిత వ్యక్తి ఎంతకీ రాకపోవడంతో అరగంట పాటు లిఫ్టులోనే నరకయాతా అనుభవించారు. ముఖ్యంగా లిఫ్ట్ లో ఉన్న మహిళలు, చిన్నపిల్లలు ఇబ్బందులకు గురయ్యారు. కొంతమంది జ్యోతి మాల్ మెయింటినెన్స్ మేనేజర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత దారుణ పరిస్థితి ఎదుర్కొన్న మాల్ కు సంబంధించిన సిబ్బంది పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement