Thursday, March 28, 2024

షీనాబోరా హత్య కేసులో ఇంద్రాణి ముఖర్జీకి బెయిల్

షీనాబోరా హత్య కేసులో ఇంద్రాణి ముఖర్జీకి సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తన కుమార్తె అయిన షీనా బోరాను చెల్లెలుగా మూడో భర్తకు పరిచయం చేసిన ఇంద్రాణి ముఖర్జియా.. మూడో భర్త మొదటి భార్య కుమారుడితో తన కూతురు సన్నిహితంగా మెలగడం, బ్లాక్ మెయిల్ చేయడంతో అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించింది. తన రెండో భర్త సంజీవ్‌, డ్రైవర్‌ శ్యామ్‌ రాయ్‌ సహకారంతో 2012లో షీనాను హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ హత్య కేసులో అరెస్టయిన ఇంద్రాణీ 2015 నుంచి ముంబయిలోని బైకుల్లా జైలులోనే ఉన్నారు. అయితే ఇంద్రాణి ముఖర్జీకి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement