Friday, April 19, 2024

భారీగా క్షీణించిన సూచీలు.. నెల రోజుల్లో రూ.32లక్షల కోట్లు హాంఫట్‌..

న్యూఢిల్లి : దేశీయ స్టాక్‌ మార్కెట్లు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. వరుసగా నాలుగు సెషన్స్‌లో భారీ నష్టాలను మూటగట్టుకున్న దేశీయ సూచీలు.. బుధవారం ఏకంగా ఇన్వెస్టర్లు రూ.5లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. ఒక నెల కాలంలో.. రూ.32 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. ఇన్వెస్టర్ల సంపదగా భావించే.. మిక్స్‌డ్‌ బీఎస్‌ఈ ఎం-క్యాప్‌ ధృవీకరించిన డేటా ప్రకారం.. బుధవారం ఏకంగా రూ.5.30 లక్షల కోట్లు కోల్పోయింది. మంగళవారం బీఎస్‌ఈ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.248.42 లక్షల కోట్లు ఉండగా.. బుధవారం నాటి భారీ నష్టాలతో.. రూ.243.11 లక్షల కోట్లకు పడిపోయింది. మార్కెట్‌లో భారీ పతనం కొనసాగుతున్నది. ఏప్రిల్‌ 11 నుంచి మే 11 వరకు సుమారు రూ.32 లక్షల కోట్ల సంపద దలాల్‌ స్ట్రీట్‌ హరించుకుపోయింది. ఏప్రిల్‌ రూ.275.11 లక్షల కోట్లుగా ఉన్న బీఎస్‌ఈ ఎం-క్యాప్‌.. రూ.243.11 లక్షల కోట్లకు పడిపోయింది.

ఒకే రోజులో రూ.5లక్షల కోట్లు ఆవిరి..

బుధవారం నాటి పతనం.. భారీగా నమోదైంది. ఏడు షేర్లు భారీగా క్షీణించాయి. యూరోపియన్‌ షేర్లు అన్నింటినీ.. బ్లాక్‌లో కొనుగోలు చేసి.. విక్రయిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇన్వెస్టర్లు అందరూ.. అమెరికా విడుదల చేసే.. ద్రవ్యోల్బణం రిపోర్టుపైనే కన్నేసి ఉంచారు. అమెరికా ద్రవ్యోల్బణం పెరిగితే.. మార్కెట్లు మరింత క్షీణించే అవకాశాలున్నాయి. ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నట్టు ఆర్థిక నిపుణులు అభిప్రాయపడ్డారు. అమెరికా ద్రవ్యోల్బణం అంచనాలు 7.50 శాతం నుంచి 8 శాతం మధ్య ఉండొచ్చు. పెరుగుతున్న మోటార్‌ గ్యాస్‌, భోజన ఖర్చుల కారణంగా.. సీపీఐ ద్రవ్యోల్బణం 7.50 శాతానికి చేరుకుంటుందని బార్క్లేస్‌ అభిప్రాయపడింది. ఏప్రిల్‌ ద్రవ్యోల్బణం తమ అంచనాలను మించే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం తగ్గుముఖం పట్టినట్టు ఎటువంటి సూచనలు కనిపించడం లేదు. దీంతో ఆహార ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలు ఉన్నాయి. కరోనా కారణంగా చైనాలో ఉత్పత్తి నిలిచిపోయింది. చాలా వరకు పరిశ్రమలు మూతపడ్డాయి.

కీలక నగరాలు లాక్డౌన్‌లోకి వెళ్లిపోయాయి. ఇది ద్రవ్యోల్బణం పెరిగేందుకు దోహదం చేస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణంగా.. గడిచిన రెండు నెలల కాలంలో.. అమెరికా మార్కెట్లోని చాలా కంపెనీలు.. ధరలను భారీగా పెంచేందుకు కారణం అయ్యాయి. ద్రవ్యోల్బణ పురోగతికి మద్దతు ఇస్తున్న ఆర్‌బీఐ కూడా గత వారం వడ్డీ రేట్లను పెంచింది. ఈ పరిణామంతో.. ఈక్విటీలలో తీవ్ర పతనాన్ని చూశామని చెబుతున్నారు. 2022లో ఇప్పటి వరకు అంతర్జాతీయ ఔట్‌ఫ్లోలు రూ.1,41,089 కోట్లకు చేరుకున్నాయని డేటా ధృవీకరించింది. ఇది 2021 చివరి మూడు నెలల్లో చూసిన రూ.38,521కోట్లకు అదనం. భారతీయ స్టాక్‌ మార్కెట్స్‌లో నిఫ్టీ 50 భారీగా పతనం అవుతున్నది. డాలర్‌ విలువ పెరుగుతున్న విదేశీ ద్రవ్య సూచీని ఈ 12 నెలల్లో 3.5 శాతం దిగువకు 18 నెలల పతనానికి నెట్టేసింది. ఇది పోలాండ్‌కు సంబంధించిన జ్లోటీ, టర్కీకి చెందిన లిరాకు సంబంధించిన కరెన్సీలపై 9-15 శాతం ఎక్కువ నష్టాలను తీసుకొచ్చింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి

Advertisement

తాజా వార్తలు

Advertisement