Friday, March 29, 2024

భారతీయులను విడిచిపెట్టిన తాలిబన్లు!

ఆఫ్గనిస్తాన్ లో భారతీయులను బంధించిన తాలిబాన్లు వారిని విడిచిపెట్టారు. కాబూల్ విమానాశ్రయానికి వెళ్తున్న పలువురు భారతీయులను నిన్న అడ్డుకుని నిర్బంధించారు తాలిబన్లు. అనంతరం విడిచిపెట్టడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్వదేశానికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న వారిని తాలిబన్లు నిర్బంధించారని, వీరిలో భారతీయులే అత్యధికులని స్థానిక మీడియా ప్రకటించడంతో అప్రమత్తమైన భారత విదేశాంగ శాఖ.. తాలిబన్ల నుంచి వారికి ఎలాంటి హానీ లేదని తెలిపింది. ప్రసుతం కాబూల్ విమానాశ్రయంలో ఉన్న వీరిని స్వదేశానికి రప్పించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. విమానాశ్రయంలో పడిగాపులు పడుతున్న వీరిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీరందరూ సురక్షితంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. తొలుత వారిని అడ్డుకున్న తాలిబన్లు పత్రాలు పరిశీలించి, ప్రశ్నించిన తరవాత విడిచిపెట్టారు.

ఇది కూడా చదవండి: చైనా చేస్తున్న పని వల్ల పురుషుల్లో అంగం సైజు త‌గ్గుతోంద‌ట‌..

Advertisement

తాజా వార్తలు

Advertisement