Tuesday, April 23, 2024

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు -విజయవంతంగా కాటరాక్ట్ సర్జరీ

న్యూఢిల్లీలోని ఆర్మీ హాస్పటల్ లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము‌కు కాటరాక్ట్ సర్జరీ (కంటి శుక్లం శస్త్రచికిత్స) జరిగింది. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ప్రతినిధి వివరాలను వెల్లడించారు. సర్జరీ విజయవంతంగా జరిగిందని.. ఆమె ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని ప్రకటనలో పేర్కొన్నారు. ద్రౌపది ముర్ము ఈ ఏడాది జూలై 25న భారతదేశ 15వ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement