Wednesday, April 24, 2024

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భార‌త్

రెండో టీ20లో టాస్ గెలిచిన భార‌త‌ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. శ్రీ‌లంక‌తో మొద‌టి టీ20లో గెలిచి ఊపు మీదున్న భార‌త్ సిరీస్‌పై క‌న్నేసింది. ముంబైలోని వాంఖ‌డేలో ఉత్కంఠ‌గా జ‌రిగిన మొద‌టి టీ20లో భార‌త్ 2 ప‌రుగుల తేడాతో గెలిచింది. ఆల్‌రౌండ‌ర్లు దీప‌క్ హుడా (41), అక్ష‌ర్ ప‌టేల్ రాణించారు. శివం మావి 4 వికెట్లు తీసి లంక‌ను దెబ్బ‌తీశాడు. తొలి మ్యాచ్‌లో గాయ‌ప‌డ్డ సంజూ శాంస‌న్ సిరీస్ మొత్తానికి దూర‌మ‌య్యాడు. అత‌ని స్థానంలో జితేశ్ శ‌ర్మ ఎంపికయ్యాడు. శ్రీ‌లంక‌ సిరీస్‌లో నిల‌వాలంటే త‌ప్ప‌క గెల‌వాలి. పూణేలోని మ‌హారాష్ట్ర క్రికెట్ అసోసియేష‌న్ స్టేడియంలో మ్యాచ్‌ జ‌రుగుతోంది.

- Advertisement -

భార‌త జ‌ట్టు : ఇషాన్ కిష‌న్ (వికెట్ కీప‌ర్‌), శుభ్‌మ‌న్ గిల్, సూర్య‌కుమార్ యాద‌వ్‌, రాహుల్ త్రిపాఠి, హార్దిక్ పాండ్యా (కెప్టెన్‌),, దీప‌క్ హుడా, అక్ష‌ర్ ప‌టేల్, శివం మావి, ఉమ్రాన్ మాలిక్‌, అర్ష‌దీప్ సింగ్‌, య‌జువేంద్ర చాహ‌ల్‌.

శ్రీలంక జ‌ట్టు : ప్ర‌థుమ్ నిస్సంకా, కుశాల్ మెండిస్ (వికెట్ కీప‌ర్‌), ధ‌నంజ‌య డిసిల్వా, చ‌రిత అస‌లంక‌, భానుక రాజ‌ప‌క్సే, ద‌సున్ శ‌న‌క (కెప్టెన్‌), వ‌నిందు హ‌స‌రంగ‌, చ‌మిక క‌రుణ‌ర‌త్నే, మ‌హీష్ థీక్ష‌ణ‌, క‌సున్ ర‌జిత‌, దిల్షాన్ మ‌ధుశ‌న‌క‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement