Friday, April 19, 2024

మ‌హిళ‌ల‌ వ‌ర‌ల్డ్ క‌ప్ టి20 – ఇంగ్లండ్ చేతిలో భార‌త్ ఓట‌మి…

ద‌క్షిణాప్రికాలో జ‌రుగుతున్న మ‌హిళ‌ల వ‌ర‌ల్డ్ క‌ప్ టి 20 లో ఇంగ్లండ్ చేతిలో భార‌త్ జ‌ట్టు ఓట‌మిపాలైంది… 152 ప‌రుగుల టార్గెట్ తో బ‌రిలోకి దిగిన ఇండియ‌న్ మ‌హిళ‌లు నిర్ధారిత 20 ఓవ‌ర్ల‌లో అయిదు వికెట్ల న‌ష్టానికి 140 ప‌రుగులు మాత్రం చేసింది.. భార‌త బ్యాట‌ర్ల‌లో స్మృతి మంద‌న 52 ప‌రుగులు చేయ‌గా, రిచా ఘోష్ 47 ప‌రుగుల‌తో నాటౌట్ గా నిలిచింది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ నిర్ధారిత 20 ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్లు న‌ష్ట‌పోయి 151 ప‌రుగులు చేసింది. ఇంగ్లండ్ స్టార్ బ్యాట‌ర్ సీవ‌ర్ బ్రంట్ ఆర్ద సెంచ‌రీ చేసింది. జోన్స్ 40, నైట్ 28 ప‌రుగులు చేశారు.. భార‌త బౌల‌ర్ రేణుకా సింగ్ కు అయిదు వికెట్లు ద‌క్క‌గా, శిఖా పాండే , దీప్తి శ‌ర్మ ఒక్కో వికెట్ తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement