Tuesday, April 23, 2024

భారత్‌ వర్సెస్‌ దక్షిణాఫ్రికా.. ప్రేక్షకులకు నో ఎంట్రీ

సెంచూరియన్‌ వేదికగా ఈ నెల 26 నుంచి భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య జరగనున్న తొలి టెస్టుకు ప్రేక్షకులను అనుమతించడంలేదు. కరోనా వేరియంట్‌ ఒమిక్రాన్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో అభిమానులను స్టేడియంలోకి అనుమతించడంలేదు. దక్షిణాఫ్రికా ప్రభుత్వం ప్రకటించిన కొవిడ్‌-19 నిబంధనల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

అయితే మ్యాచ్‌ మొదలయ్యేనాటికి సౌతాఫ్రికా ప్రభుత్వం అంగీకరిస్తూ పరిమిత సంఖ్యలో ప్రేక్షకులను బాక్సింగ్‌ టెస్టును వీక్షించేందుకు అనుమతించే అవకాశం ఉంది. ప్రేక్షకులను అనుమతించే విషయంలో స్పష్టత లేకపోవడంతో రెండో టెస్టుకు టికెట్ల విక్రయాలను నిలిపివేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement