Wednesday, April 24, 2024

కరోనా ప్రళయం.. మళ్లీ 2 లక్షలు దాటిన కేసులు

దేశంలో కరోనా విలయ తాండవం చేస్తోంది. గురువారం రికార్డు స్థాయిలో రెండు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవగా.. గడిచిన 24 గంటల్లో మరోసారి రికార్డు స్థాయిలో 2,17,353 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కొత్తగా 1,185 మంది మృత్యువాతపడ్డారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,42,91,917కు పెరిగింది. కొత్తగా 1,18,302 మంది డిశ్చార్జ్ అవగా.. ఇప్పటి వరకు 1,25,47,866 మంది కోలుకున్నారు. వైరస్‌ బారినపడి ఇప్పటి వరకు 1,74,308 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు 11,72,23,509 మంది కరోనా వ్యాక్సిన్ డోసులు వేసినట్లు ఆరోగ్య మంత్రిత్వశాఖ వివరించింది. గురువారం ఒక్కరోజే 14.73లక్షల కరోనా టెస్టులు చేసినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) తెలిపింది. ఇప్పటి వరకు 26.34 కోట్ల నమూనాలను పరిశీలించినట్లు పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement