Friday, March 29, 2024

ఆసియాకప్‌ నుంచి భారత్‌ ఔట్‌

ముంబై: ఏఎఫ్‌సీ మహిళల ఫుట్‌బాల్‌ ఆసియాకప్‌ నుంచి భారత మహిళలజట్టు వైదొలిగింది. దీంతో గ్రూప్‌-ఎ భారత మహిళల జట్టు ఆడాల్సిన మ్యాచ్‌లను రద్దు చేశారు. భారతజట్టులో 12మందికి కరోనా పాజిటివ్‌ రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మరో ఇద్దరు గాయాల బారిన పడటంతో చైనీస్‌ తైపీతో ఆదివారం జరగాల్సిన మ్యాచ్‌ చివరినిమిషంలో నిలిపివేశారు.

మ్యాచ్‌కు అవసరమైన 13మంది ప్లేయర్స్‌ అందుబాటులో లేకపోవడంతో భారత్‌ టోర్నీ నుంచి తప్పుకుందని ఎఎఫ్‌సీ ప్రకటించింది. కాగా నిబంధనల ప్రకారం మ్యాచ్‌కు ఏ జట్టు అయిన సిద్ధంకాలేకపోతే పోటీనుంచి తప్పుకున్నట్టు ప్రకటిస్తారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement