Thursday, April 25, 2024

డబ్ల్యూటీసీ ఫైనల్: కీలక వికెట్లు కోల్పోయిన భారత్

సౌతాంప్టన్ వేదికగా జరుగుతున్న ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా కష్టాల్లో పడింది. రిజర్వ్ డే సందర్భంగా మ్యాచ్ ఆరో రోజు కొనసాగుతోంది. అయితే ఆరో రోజు ఆట ప్రారంభంలోనే భారత్ విరాట్ కోహ్లీ (13) వికెట్‌ను కోల్పోయింది. వరుసగా రెండో ఇన్నింగ్స్‌లోనూ కోహ్లీ తన వికెట్‌ను జేమీసన్‌కే సమర్పించుకున్నాడు. మరోవైపు నిలకడగా ఆడతాడని పేరున్న పుజారా సైతం ఔటయ్యాడు. అతడి వికెట్‌ కూడా జేమీసన్‌కు దక్కింది. భారత్ ప్రస్తుతం 81 పరుగులు చేసి 4 వికెట్లు కోల్పోయింది. తద్వారా న్యూజిలాండ్‌సై కేవలం 49 పరుగులు మాత్రమే ఆధిక్యంలో ఉంది. కాగా రిజర్వుడే రోజు మొత్తం 98 ఓవర్లు అందుబాటులో ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement