Friday, March 29, 2024

ఇండియాలో తగ్గిన కరోనా కేసులు..

ఇండియాలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా దేశంలో 20,799 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 180 మంది మృతి చెందారు. దేశంతో మొత్తం ఇప్పటి వరకు 3,31,21,247 మంది కోలుకొని డిశ్చార్జ్ అయినట్టు గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో కరోనాతో ఇప్పటి వరకు 4,48,997 మంది మృతి చెందారు. దేశంలో 2,64,458 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్త కేసుల కంటే రికవరీ కేసులు పెరుగుతుండటంతో అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. కరోనా మహమ్మారి నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదని, తప్పనిసరిగా ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాల్సిందే అని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇక దేశంలో ఇప్పటి వరకు మొత్తం 90,79,32,861 మందికి టీకాలు వేశారు.

ఇది కూడా చదవండి: జగన్ ను కొందరు ఐఏఎస్ అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారు: మోహన్ బాబు

Advertisement

తాజా వార్తలు

Advertisement