Wednesday, April 24, 2024

అలర్ట్: దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా ఉధృతి..

దేశంలో కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి. తాజాగా 44,230 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. అలాగే, 24 గంట‌ల్లో 42,360 మంది కోలుకున్నారు. నిన్న‌ 555 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,23,217కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,07,43,972 మంది కోలుకున్నారు. 4,05,155 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 45,60,33,754 వ్యాక్సిన్ డోసులు వేశారు. ఇక 45.60 కోట్ల మందికి పైగా కొవిడ్ టీకాలు పంపిణీ చేశారు.

ఇది కూడా చదవండి : ఏసీబీ వలలో చిక్కిన యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్

Advertisement

తాజా వార్తలు

Advertisement