Friday, April 19, 2024

దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు..

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి..ఇటీవల కొద్ది రోజులుగా నిలకడగా నమోదయిన కేసులు ఇప్పుడు కాస్త పెరిగాయి… గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 41,157 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,10,64,908కు చేరింది. అలాగే, నిన్న 42,004  మంది కోలుకున్నారు. ఇక 518 మంది క‌రోనాతో నిన్న ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,13,609కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,02,69,796 మంది కోలుకున్నారు. 4,22,660 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.  ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం  40,49,31,715 వ్యాక్సిన్ డోసులు వేశారు.

ఇది కూడా చదవండి: విజయవాడ, సాగర్‌లలో వాటర్ ఏరో డ్రోమ్‌లు

Advertisement

తాజా వార్తలు

Advertisement