Saturday, April 20, 2024

దేశంలో కొత్తగా 39,742 క‌రోనా కేసులు

దేశంలో కరోనా వ్యాప్తి స్థిరంగా కొనసాగుతోంది. గత మూడు వారాలుగా ముప్ఫై ఐదు వేల నుంచి 50 వేల మధ్యలో రోజువారి కొత్త కేసులు నమోదవుతున్నాయి. నిన్న కొత్తగా 39,742 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,13,71,901కు చేరింది. అలాగే, నిన్న 39,972 మంది కోలుకున్నారు.

మరణాల విషయానికొస్తే… నిన్న‌ 535 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,20,551కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,05,43,138 మంది కోలుకున్నారు. 4,08,212 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 43,31,50,864 వ్యాక్సిన్ డోసులు వేశారు.

ఇది కూడా చదవండి: మీరాబాయికి బంఫర్ ఆఫర్.. లైఫ్ టైమ్ పిజ్జా ఫ్రీ..

Advertisement

తాజా వార్తలు

Advertisement