నేడు, రేపు ఢిల్లీలో జరిగే వార్షిక సింధూ నదీ సమావేశంలో పాక్ జల నిపుణుల బృందం పాల్గొననుంది. జలాల పంపకాలపై భారత్-పాక్ అధికారులు చర్చించుకోనున్నట్టు సమాచారం. ఈ మేరకు పాక్ సింధూ కమిషనర్ సయ్యద్ అలీషా నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల బృందం భారత్కు చేరుకుంది. అటు భారత ప్రతినిధి బృందానికి పీ.కే.సక్సేనా నాయకత్వం వహిస్తున్నారు. ఆయనతో పాటు ఈ భేటీలో కేంద్ర జల కమిషన్, విద్యుత్ అథారిటీ, తదితర అధికారులు పాల్గొంటారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement