Tuesday, April 23, 2024

Follow up | ప్లాటుగా ముగిసిన సూచీలు

స్టాక్‌మార్కెట్లు మంగళవారం నాడు ప్లాట్‌గా ముగిశాయి. ఉదయం భారీ లాభాల్లో ప్రారంభమైనప్పటికీ, గరిష్టాల వద్ద అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. ఫలితంగా క్రమంగా సూచీలు తీవ్ర ఒడుదొడుకుల్లో చలించాయి. గరిష్టాల వద్ద మదుపర్లు లాభాలకు దిగడంతో సూచీలు మరింత దిగువకు వచ్చాయి. బ్యాంకింగ్‌ షేర్లలో అమ్మకాలు భారీగా జరగడం కూడా మార్కెట్లకు ప్రతికూలగా మారింది.

సెన్సెక్స్‌ 37.08 పాయింట్ల లాభంతో 60978.75 వద్ద ముగిసింది. నిఫ్టీ 0.25 పాయింట్ల నష్టంతో 18118.30 వద్ద ముగిసింది. బంగారం 10 గ్రాముల ధర 96 రూపాయలు పెరిగి 56911 వద్ద ట్రేడయ్యింది. వెండి కిలో ధర 24 రూపాయలు పెరిగి 67988 వద్ద ట్రేడయ్యింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 80.97 రూపాయలుగా ఉంది.

లాభపడిన షేర్లు..

టాటా మోటార్స్‌, మారుతీ సుజుకీ , హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఏషియన్‌ పెయింట్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, టీసీఎస్‌, టెక్‌ మహీంద్రా, ఐటీసీ, భారతీ ఎయిర్‌టెల్‌, ఇన్పోసిస్‌, టైటాన్‌ కంపెనీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, ఇందూస్థాన్‌యూనిలీవర్‌, బజాజ్‌ ఆటో షేర్లు లాభపడ్డాయి.

- Advertisement -

నష్టపోయిన షేర్లు..

యాక్సిస్‌ బ్యాంక్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఎల్‌ అండ్‌ టీ, ఎస్‌బీఐ, సన్‌ ఫార్మా, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఆల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, నెస్లే ఇండియా, ఎం అండ్‌ ఎం, విప్రో, ఐసీఐసీఐ బ్యాంక్‌, అపోలో ఆస్పటల్స్‌, దివిస్‌ ల్యాబ్‌, అదాన్‌ పోర్ట్స్‌, కోల్‌ ఇండియా, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌ షేర్లు నష్టపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement