Thursday, April 25, 2024

తెలంగాణ కొత్త స‌చివాల‌యం ప్రారంభోత్స‌వం.. హాజరుకానున్న స్టాలిన్.. హేమంత్ సొరెన్

తెలంగాణ కొత్త స‌చివాల‌యం ప్రారంభోత్స‌వం ఫిబ్ర‌వ‌రి 17న జ‌ర‌గ‌నుంది. కాగా ఈ ప్రారంభోత్సవం ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల నడుమ నిర్వహించేందుకు ముహూర్తం ఖరారైంది. తెలంగాణ సచివాలయ ప్రారంభోత్సవానికి ఇద్దరు ముఖ్యమంత్రులు, పలువురు జాతీయస్థాయి నేతలు తరలిరానున్నారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, జార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్ ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన‌నున్నారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్ తరఫున లలన్ సింగ్ (జేడీయూ నేషనల్ ప్రెసిడెంట్), బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ మనవడు తదితరులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. సచివాలయ ప్రారంభోత్స కార్యక్రమానికి ముందు వాస్తుపూజ, చండీయాగం, సుదర్శనయాగం నిర్వహించనున్నారు. సచివాలయ ప్రారంభోత్సవం అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో భారీ సభ ఏర్పాటు చేశారు. ఈ మేరకు తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలియ‌జేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement