Thursday, March 28, 2024

బీఆర్ ఎస్ జాతీయ కార్యాలయం ప్రారంభం.. సంబరాలు చేసుకున్న మహారాష్ట్ర వాసులు

మహారాష్ట్ర వాసులు బీఆర్ ఎస్ జాతీయ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా సంబరాలు చేసుకున్నారు. నాందేడ్ జిల్లా కిన్వట్ తాలుకా పాటోథా గ్రామస్థులు బీఆర్‌ఎస్‌ , సీఎం కేసీఆర్ ఫొటోతో కూడిన బ్యానర్లను ప్రదర్శించారు. జై బీఆర్‌ఎస్‌, జైజై కేసీఆర్‌ అంటూ నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని దేశానికి ఆయన నాయకత్వం ఎంతో అవసరమని తెలిపారు.

ఆప్ కీ బార్ కిసాన్ కి సర్కార్’ అనే నినాదంతో కేసీఆర్ ప్రధానమంత్రి అవుతారని అభిప్రాయం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీకి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని వారు ప్రకటించారు.కేసీఆర్ తెలంగాణ రైతుల కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారన్నారు..ముఖ్యంగా రైతు బంధు, రైతు బీమా ద్వారా రైతులను ఆదుకుంటున్నారని అన్నారు. పేదల ఆడపిల్లల వివాహాలకు రూ. లక్ష అందిస్తున్నారని తెలిపారు. తెలంగాణకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ గ్రామాన్ని తెలంగాణలో కలపాలని వారంతా కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement