Thursday, April 25, 2024

Shiridi | సాయిబాబా స‌న్నిధిలో మంత్రులు, ఎమ్మెల్యేలు.. తీర్థ ప్ర‌సాదాలు అందించిన సంస్థాన్‌

షిర్డీ (ప్రభ న్యూస్) : తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇవ్వాల (సోమ‌వారం) మ‌హారాష్ట్ర‌లోని షిరిడీ సాయిబాబాను ద‌ర్శ‌నం చేస‌కున్నారు. బాబాని ద‌ర్శించుకున్న వారిలో తెలంగాణ‌ మంత్రులు నిరంజ‌న్‌రెడ్డి, శ్రీ‌నివాస్‌గౌడ్ ఉన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు ఆల వెంక‌టేశ్వ‌ర్‌రెడ్డి, బీరం హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌రెడ్డి కూడా షిరిడీ సాయిని ద‌ర్శించుకున్న‌రు. ఈ సంద‌ర్భంగా బాబా స‌న్నిధిలో కొద్దిసేపు గ‌డిపిన వారికి సంస్థన్‌ వారు సత్కరించి, సాయినాథుడి తీర్థ‌ ప్రసాదాలు అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement