Saturday, April 20, 2024

భారత్ లో లక్ష మార్క్ క్రాస్ చేసిన కరోనా కేసులు!

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకీ పెరుగుతోంది. నిన్న మొన్నటి వరకూ వేలల్లో నమోదైన కేసులు ఇప్పుడు ఏకంగా లక్ష మార్క్ ను క్రాస్ చేశాయి. గడచిన 24 గంటల్లో 1,03,558 కొత్త కేసులు నమోదయ్యాయి. అలాగే కరోనా నుంచి 52,847 మంది కొలుకున్నారు. మరోవైపు 478 మంది ఈ మహమ్మారి కారణంగా మృతి చెందారని కొరత బులిటెన్ లో కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

తాజా గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 1,25,89,067 కేసులు నమోదు అయ్యాయి. అలాగే 1,16,82,136 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 7,41,830 యాక్టివ్ కేసులో దేశ వ్యాప్తంగా ఉన్నాయి. మరోవైపు 1,65,101 మంది కరోనా కారణంగా మృతి చెందారు. ఇదిలా ఉండగా ఇప్పటివరకు 7,91,05,163 మంది కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement