Saturday, April 20, 2024

తెలంగాణలో ఇంకా పెరగని కరోనా టెస్టులు…కొత్తగా 4801 కేసులు

తెలంగాణ‌లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. టెస్ట్ లకు తగ్గట్టుగానే కేసులు కూడా నమోదు అవుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల 75,289 మందికి క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేయగా.. 4,801 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. ఇక తాజా గణాంకాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య‌ 5,06,988కి చేరింది. అలాగే క‌రోనా బారిన‌ప‌డి 24 గంటల్లో 32 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనితో మొత్తం రాష్ట్రంలో 2,803 మంది కరోనా తో చనిపోయారు.

అలాగే ఇప్ప‌టివ‌ర‌కు 4.44 ల‌క్ష‌ల మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 60,136 మంది చికిత్స పొందుతున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మరణాల రేటు 0.55 శాతం ఉండగా .. రికవరీ రేటు 87.58 శాతంగా ఉందని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement