Thursday, April 25, 2024

28 మంది పిల్లలకు కరోనా పాజిటివ్…ఎక్కడో తెలుసా ?

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గుతున్నప్పటికీ ప్రతిరోజు వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. అయితే ఈ కరోనా మహమ్మారి ఎప్పుడు ఎలా సోకుతుందో తెలియని పరిస్థితిలో ప్రస్తుతం జనాలు ఉన్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లాలోని వై టి సి లో కరోనా కలకలం సృష్టించింది. సూపర్ 60 కోచింగ్ తీసుకుంటున్న 28 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.

వారం రోజులు సెలవులు పై ఇళ్లకు వెళ్లిన విద్యార్థులు తిరిగి కోచింగ్ సెంటర్ కు చేరుకున్నారు. ఈ నెల 2వ తేదీ నుంచి శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. అయితే కొంత మంది విద్యార్థులకు జలుబు,దగ్గు వంటి లక్షణాలు కనిపించడంతో మొత్తం 120 మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో 28 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆ విద్యార్థులకు ప్రస్తుతం శిక్షణ తరగతులను ఆపేసినట్లు ఐటిడిఎ పిఓ శ్రీధర్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement