Thursday, April 25, 2024

తార‌క‌ర‌త్న జ్ఞాపకార్థం.. హార్ట్ ప్రాబ్లమ్స్ కి ఫ్రీగా వైద్యం

నంద‌మూరి బాల‌కృష్ణ ఆధ్వ‌ర్యంలో బ‌స‌వ‌తార‌కం క్యాన్స‌ర్ ఆసుప‌త్రి న‌డుస్తోన్న సంగ‌తి తెలిసిందే..కాగా త‌న సోద‌రుడి కుమారుడు..న‌టుడు తార‌క‌ర‌త్న గుండెజ‌బ్బుతో మ‌ర‌ణించారు. ఆయ‌న జ్ఞాపకార్థం బసవతారకం ఆసుపత్రిలో ఒక వార్డుకు తారకరత్న పేరును పెట్టారు బాల‌కృష్ణ‌. గుండె సమస్యలతో బాధపడుతున్న పేదలకు ఈ వార్డులో ఉచితంగా వైద్య సేవలను అందించనున్నట్టు బాలయ్య ప్రకటించారు. మరోవైపు తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి మరోసారి బాలయ్య గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఆమె స్పందిస్తూ… ‘నేను ఏమి చెప్పగలను.

మీకు నా కృతజ్ఞలను ఎలా తెలియజేయగలను. మీ గురించి ఏది చెప్పినా తక్కువే అవుతుంది. బంగారు హృదయం కలిగిన గొప్ప వ్యక్తి అని చెప్పడం ఎంతమాత్రం ఆశ్చర్యకరం కాదు. మీకు ఎవరూ సాటి కాదు. మీరు ఒక స్నేహితుడు, తండ్రి కంటే ఎక్కువ. ఇప్పుడు మీలో దేవుడిని చూసుకుంటున్నాను. మీ మంచితనాన్ని వర్ణించడానికి మాటలు సరిపోవడం లేదు. నా హృదయాంతరాల్లో నుంచి మీకు ధన్యవాదాలు చెపుతున్నాను. మీరు మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారో… అంతకంటే ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాము. జై బాలయ్య అంటూ ఎంతో భావోద్వేగంగా ఆమె స్పందించారు. బాలయ్య తీసుకున్న నిర్ణయం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement