Thursday, April 25, 2024

మరో వివాదంలో ఎమ్మెల్యే రాజాసింగ్.. పోలీసుల‌ నోటీసులు

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై మరో కేసు నమోదైంది. అజ్మీర్‌ దర్గాపై రాజాసింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల విషయంలో ఆయ‌న‌పై చర్యలు తీసుకోవాలంటూ సయ్యద్‌ మహమూద్‌ అలీ అనే వ్యక్తి గత ఏడాది పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కంచన్ భాగ్ పోలీస్ స్టేషన్ లో రాజాసింగ్ పై కేసు నమోదు కాగా.. వారు మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. తాజాగా, మంగళ్‌హాట్‌ పోలీసులు ఎమ్మెల్యే రాజాసింగ్‌కు సీఆర్పీసీ 41ఎ కింద నోటీసులు ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement