Wednesday, March 27, 2024

ఏపీలో స్థిరంగా కరోనా కేసులు…కొత్తగా ఎన్నో తెలుసా ?

ఏపీలో అదే స్థాయిలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,02,712 సాంపిల్స్ ని పరీక్షించగా 6,151 మంది కోవిడ్ 19 పాజిటివ్ గా నిర్ధారింపబడ్డారు. అలాగే కోవిడ్ వల్ల చిత్తూర్ లో పన్నెండు మంది, ప్రకాశం లో ఏడుగురు, గుంటూరు లో ఆరుగురు, తూర్పు గోదావరి లో ఐదుగురు, అనంతపూర్ లో నలుగురు, కృష్ణ లో నలుగురు, పశ్చిమ గోదావరి లో నలుగురు, వైఎస్ఆర్ కడప లో ముగ్గురు, నెల్లూరు లో ముగ్గురు, శ్రీకాకుళం లో ముగ్గురు, విశాఖపట్నం లో ముగ్గురు, కర్నూల్ లో ఇద్దరు మరియు విజయనగరం లో
ఇద్దరు మరణించారు.

గడచిన 24 గంటల్లో 7,728 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. నేటి వరకు రాష్ట్రంలో 2,08,39,147 సాంపిల్స్ ని పరీక్షించడం జరిగింది.

రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య… 1832902

యాక్టీవ్ కేసుల సంఖ్య… 69831

- Advertisement -

డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య.. 1750904

మొత్తం మరణాలు…12167

Advertisement

తాజా వార్తలు

Advertisement