Friday, March 29, 2024

‘‘ఏ అమ్మాయిని చూసినా అమ్మోరు గుర్తురావాలి కొడుకుల‌కి’’.. ఆకట్టుకుంటున్న శాకిని డాకిని ట్రైల‌ర్!

ఏ అమ్మాయిని చూసినా అమ్మోరు గుర్తుకు రావాలి కొడుకులకి.. అంటూ శాకిని డాకిని మూవీ ట్రైలర్​ అదరగొడుతోంది. కొరియ‌న్ మూవీ మిడ్‌నైట్ రన్నర్స్‌కి అఫీషియ‌ల్ రిమేక్​గా ఈ యాక్షన్ డ్రామా సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో రెజీనా కసాండ్రా, నివేథా థామస్ పోలీస్ ఆఫీసర్స్ గా ఉండడం మరింత క్యూరియాసిటీని పెంచుతోంది. ఇక.. హాస్టల్​ నేపథ్యంలో వీరు చేసే ఫీట్లు ఆకట్టుకునేలా ఉండనున్నట్టు తెలుస్తోంది. ఈ థ్రిల్ల‌ర్ యాక్ష‌న్ డ్రామా సినిమాకు సుధీర్ వర్మ దర్శకత్వం వహించారు. ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకురానున్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది.

శిక్షణ కోసం పోలీసు అకాడమీలో చేరిన ఇద్దరమ్మాయిల కథతో ఈ సినిమా రూపొందినట్లు టైల‌ర్ చూస్తే అర్థమవుతోంది. యాక్షన్, డ్రామా, హాస్టల్​ నేపథ్యంలో సినిమా ఉండబోతోందని స్పష్టం అవుతోంది. అయితే.. ట్రైల‌ర్ లోని ఇద్దరు హీరోయిన్స్​ లక్స్ యాక్ష‌న్ సీక్వెన్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. మరి, వీరికి ఎదురైన సమస్యేంటి? హాస్ట‌ల్ లో ఉండే వీరు సివంగుల్లా ఎందుకు మార్చాల్సి వచ్చింది అనే విషయం సినిమా చూస్తే కానీ తెలిసేలా లేదు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement