Thursday, April 25, 2024

Breaking: గురుకుల పాఠ‌శాల‌లో 40మంది విద్యార్థులకు అస్వస్థత

గురుకుల పాఠ‌శాల విద్యార్థులు 40మంది అస్వ‌స్థ‌త‌కు గురైన ఘ‌ట‌న తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని కురవి మండలం సీరోల్ ఏకలవ్య గురుకుల పాఠశాలలో ఆహారం విషతుల్యమవడంతో 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అయితే ఈ విషయాన్ని బయట పడనీయకుండా ఉపాధ్యాయ బృందం విద్యార్థులకు రహస్యంగా వైద్య పరీక్షలు చేయిస్తోంది. తల్లితండ్రులకు సమాచారం ఇవ్వకుండా గుట్టుగా వైద్య పరీక్షలు చేయించడంపై ప‌లువురు విమర్శలు వ్య‌క్తం చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement