Wednesday, April 24, 2024

చట్టవిరుద్ధ కంటెంట్‌ను త్వరగా తొలగించాలి.. 72 గంటల దాకా వేచిచూడొద్దు: ఐటీ మంత్రి

చట్టప్రకారం అక్రమ కంటెంట్‌ను తొలగించడానికి సామాజి మాధ్యమాలకు 72గంటల సుదీర్ఘ సమయం ఉందని, అయితే వీలైనంత త్వరగా అటువంటి కంటెంట్‌ను తొలగించాలని ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ అన్నారు. తప్పుడు ప్రచారం వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున, చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను తొలగించేందుకు గడువును 24 గంటలకు తగ్గించాలని మంత్రిత్వశాఖ ఆలోచిస్తున్న దని చెప్పారు. ”స్పష్టంగా చెప్పాలంటే, 72 గంటలు చాలా ఎక్కువ సమయం అని మంత్రి అభిప్రాయపడ్డారు. పిల్లల లైంగిక వేధింపుల మెటీరియల్‌ నుండి నగ్నత్వం వరకు ట్రేడ్‌మార్క్‌ మరియు పేటెంట్‌ ఉల్లంఘనలు, తప్పుడు సమాచారం, మరొక వ్యక్తి వలె నటించడం, దేశ ఐక్యత, సమగ్రతను బెదిరించే కంటెంట్‌ అలాగే ”వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించే” కంటెంట్‌ మతం లేదా కులం ప్రాతిపదికన హింసను ప్రేరేపించే ఉద్దేశ్యంతో కంటెంట్‌ను చట్టవిరుద్ధమైనదిగా భావించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఫిర్యాదులపై వేగంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.

శుక్రవారం నుండి అమల్లోకి వచ్చిన కొత్త ఐటీబంధనల ప్రకారం, ప్లాట్‌ఫారమ్‌లు తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి, చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను వారి స్వంతంగా తొలగించడానికి సహేతుకమైన ప్రయత్నం చేయడానికి ఎక్కువ బాధ్యత కలిగి ఉంటాయి. ”మీ కంటెంట్‌ నియంత్రణ, అల్గోరిథం, వ్యక్తులు మొదలైన వాటితో మీరు దీన్ని చేయలేకపోతే, ఆ కంటెంట్‌ 72 గంటల్లో తొలగించాల్సి ఉంటుంది” అని మంత్రి చెప్పారు. అలాంటి కంటెంట్‌ను మరింత ఎక్కువగా తీసివేయడానికి అన్ని ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉందని రాజీవ్‌ చంద్రశేఖర్‌ చెప్పారు.

ఫిర్యాదుల పరిష్కారానికి రెండు కమిటీలు?

సామాజిక మాధ్యమాలపై వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి ప్రభుత్వం తొలుత ఒకటి లేదా రెండు కమిటీలను నియమిస్తుందని కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. కాలక్రమేణా అవసరాన్ని బట్టి కమిటీల సంఖ్యను పెంచుతామని అన్నారు. మినిస్ట్రీ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శుక్రవారం ఐటీ రూల్స్‌, 2021ని సర్దుబాటు చేసింది. కొత్తగా చొప్పించిన నియమాలు సోషల్‌ మీడియా కంటెంట్‌ నియంత్రణపై ఫిర్యాదులను పరిష్కరించడానికి బ#హుళ ఫిర్యాదుల అప్పీలేట్‌ కమిటీలను (జీఏసీ) నియమించడానికి ప్రభుత్వాన్ని అనుమతిస్తాయి. జిఎసి నిర్మాణం, సంస్థ, పనితీరును ప్రభుత్వం త్వరలో వెల్లడిస్తుందని మంత్రి చెప్పారు.

- Advertisement -

”జీఏసీలను స్వీయ-నియంత్రణ సంస్థగా మార్చవచ్చా అనే దానిపై పరిశ్రమ నుండి ఒక ప్రశ్న ఉంది. నేను ఇంతకు ముందే చెప్పాను. అంబుడ్స్‌మన్‌ పాత్ర పోషించడానికి ప్రభుత్వానికి ఆసక్తి లేదు” అని చంద్రశేఖర్‌ అన్నారు. భారతదేశంలో మధ్యవర్తులు పనిచేయడానికి ఇబ్బందులు పెంచాలని ప్రభుత్వం భావించడం లేదని, అయితే జీఏసీలను నియమించాలనే నిబంధన కేవలం భారతీయ పౌరులకు జవాబుదారీతనాన్ని అందించడమేనని మంత్రి అన్నారు. ప్రస్తుత ఫిర్యాదుల పరిష్కార విధానంలో తీవ్ర లోపాలున్నాయన్న ఆయన, ”మనకు పౌరులు, డిజిటల్‌ నాగరికుల నుండి లక్షల సందేశాలు ఉన్నాయి. వారి ఫిర్యాదులకు స్పందన కరువైంది. ఇది మాకు ఆమోదయోగ్యం కాదు” అని మంత్రి వ్యాఖ్యానించారు. సురక్షితమైన, విశ్వసనీయ ఇంటర్నెట్‌ను సాధించేందుకు ఇంటర్నెట్‌లోని కంపెనీలతో భాగస్వామ్యం కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement