Saturday, April 20, 2024

ఎమ‌ర్జెన్సీ ఫెయిల్ అయితే నా ఆస్తుల‌న్నీ పోతాయ్.. కంగ‌నార‌నౌత్

ఈ సినిమా పోయిందా త‌న ఆస్తుల‌న్నీ పోయిన‌ట్టేన‌ని తెలిపింది బాలీవుడ్ హీరోయిన్ కంగనా ర‌నౌత్.ఆమె స్వయంగా దర్శకత్వం వహిస్తూ, తానే నిర్మాతగా వ్యవహరిస్తున్న చిత్రం ఎమర్జెన్సీ . ఒకవేళ ఎమర్జెన్సీతో మొత్తం కోల్పోతే మళ్లీ మొదటి పరిస్థితికే వస్తానని కంగనా చెప్పుకొచ్చింది. ఇలా జరిగినా తాను ఆత్మవిశ్వాసం కోల్పోనని చెప్పుకొచ్చిన కంగనా.. తన కాళ్లపై నిలబడతాననే నమ్మకం ఉందని సదరు వీడియోలో ప్రస్తావించారు. 1975 నాటి ఎమర్జెన్సీ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ఇందులో కంగనా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను జరుపుకుంటోంది. ఇక సినిమాలతో బిజీగా ఉండే కంగనా.. సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా తాను గతంలో పాల్గొన్న పలు ఇంటర్వ్యూలకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను షేర్‌ చేశారు.తన కెరీర్‌లో ఎదుర్కొన్న కష్టాల గురించి పంచుకున్నారు. తనకు వంట చేయడం చాలా ఇష్టమని, అందుకే రెస్టారంట్‌ ప్రారంభించాలనుకుందటా.. కానీ ఆర్థిక ఇబ్బందులతో ఆ ప్రయత్నం నెరవేరలేదని చెప్పుకొచ్చారు. ఎమర్జెన్సీ చిత్ర నిర్మాణం కోసం ఇంటితో సహా విలువైన వస్తువులన్నీ తాకట్టు పెట్టి మరీ ఈ సినిమా నిర్మిస్తున్నానని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement