Thursday, April 25, 2024

దేశంలో కరోనా థర్డ్ వేవ్ సంకేతాలు కనిపిస్తున్నాయి: ఐసీఎంఆర్

కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందనే అనుమానాలు నానాటికీ బలపడుతున్నాయి. తాజాగా ఐసీఎంఆర్ కు చెందిన అంటువ్యాధుల నిపుణులు డాక్టర్ సమిరన్ పాండా మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో థర్డ్ వేవ్ సంకేతాలు కనిపిస్తున్నాయని చెప్పారు. సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువగా లేని రాష్ట్రాల్లో కూడా ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్నాయని… ఈ ట్రెండ్ థర్డ్ వేవ్ సంకేతాలను చూపుతోందని హెచ్చరించారు.

సెకండ్ వేవ్ సమయంలో అనేక రాష్ట్రాలు చర్యలు తీసుకున్నాయని ఐసీఎంఆర్‌కు చెందిన డా.సమిరన్ పాండా తెలిపారు. పలు రాష్ట్రాలు కరోనా వ్యాక్సిన్ కార్యక్రమాన్ని వేగవంతం చేశాయని.. అందువల్ల సెకండ్ వేవ్ అంత తీవ్రతను చూపలేదని చెప్పారు. ఇప్పుడు అందరూ మూడో వేవ్‌కు సిద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన తెలిపారు.

ఈ వార్త కూడా చదవండి: సరదాకి డీఎన్ఏ టెస్టు చేయించిన తండ్రి..విషయం తెలిసి షాక్

Advertisement

తాజా వార్తలు

Advertisement