Friday, April 19, 2024

ఐసీఐసీఐ బ్యాంకు కస్టమర్లకు గమనిక.. ఆగస్టు 1 నుంచి బాదుడే బాదుడు

దేశంలో అతిపెద్ద ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ ఐసీఐసీఐ సర్వీసు ఛార్జీలు పెంచనుంది. డొమెస్టిక్ సేవింగ్ అకౌంట్ హోల్లర్లు నగదు లావాదేవీలు, ఏటీఎం ఇంటర్‌ఛేంజ్, చెక్‌బుక్ ఛార్జీలను పెంచుతున్నట్లు నోటీసులు పంపింది. పెంచిన ఛార్జీలను ఆగస్టు 1 నుంచి అమలు చేయనుంది.

పెరగనున్న ఛార్జీల వివరాలు:
★ మెట్రో ప్రాంతాలైన 6 లొకేషన్లలో ఉండేవారికి నెలలో జరిపే మొదటి 3 లావాదేవీలు ఉచితం
★ ఇతర ప్రదేశాల్లో ఉండేవారికి నెలలో జరిపే మొదటి ఐదు లావాదేవీలు ఉచితం
★ ఫైనాన్షియల్ లావీదేవీకి రూ.20, నాన్ ఫైనాన్షియల్ లావాదేవీకి రూ.8.50.
★ మొత్తం మీద ఐసీఐసీఐ బ్యాంక్ ఉచితంగా 4 లావాదేవీలు చేసుకునేందుకు అనుమతిస్తుంది.
★ బ్యాంక్ వెబ్ సైట్ ఆధారంగా పైన చెప్పిన వాటి కంటే ఎక్కువ లావాదేవీలు చేస్తే ఒక్కోదానికి రూ.150చొప్పున వసూలు చేస్తుంది.
★ అకౌంట్ ఉన్న బ్యాంక్ బ్రాంచ్ నుంచి ఒక నెలలో రూ.లక్ష డ్రా చేయాలనుకుంటే సర్వీస్ ఛార్జ్ లేకుండా డ్రా చేసుకోవచ్చు. లక్ష కంటే ఎక్కువైతే కనీసం రూ.150 తగ్గకుండా ఛార్జ్ తప్పదు.
★ ఇతర బ్రాంచీలో లావాదేవీ జరిపితే రోజుకు రూ.25వేల వరకూ ఉచితం. అంతకుమించి దాటితే రూ.వెయ్యికి రూ.5 చొప్పున పెరుగుతుంది. అదనంగా మినిమం ఛార్జీ రూ.150 కూడా.
★ థర్డ్ పార్టీ లావాదేవీ చేయాలనుకుంటే రూ.25వేల వరకూ సర్వీస్ ఛార్జ్ ఉండదు. అంతకంటే ఎక్కువ చేస్తే కనీస ఛార్జ్ రూ.150కంటే అదనం.
★ 20 చెక్ లీవ్స్ వరకూ ఉచితమే. లిమిట్ దాటితే ప్రతి చెక్ లీవ్‌కు రూ.20 చొప్పున 10 లీవ్స్ తీసుకోవచ్చు.
★ తొలి 4 లావాదేవీలు ఉచితమే. అంతకుమించి లావాదేవీ చేస్తే వెయ్యి రూ. 5 చొప్పున పెరుగుతుంది. కనీసం రూ.150 తప్పనిసరి.

ఈ వార్త కూడా చదవండి: పేటీఎంలో 20వేల ఉద్యోగాలు

Advertisement

తాజా వార్తలు

Advertisement