Friday, April 26, 2024

రాష్ట్ర సర్వీసు నుంచి 10 మందికి ఐఏఎస్‌ హోదా..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : రాష్ట్ర సర్వీసు నుంచి 10 మంది అధికారులకు ఐఏఎస్‌ హోదా లభించింది. వీరిలో జల్ద అరుణశ్రీ, ఎ.నిర్మల కాంతి వెస్లీ, కోటా శ్రీవాస్తవ, చెక్కా ప్రియాంక, బడుగు చంద్రశేఖర్‌, కోరం అశోక్‌ రెడ్డి, హరిత, వెంకట నర్సింహారెడ్డి, కాత్యాయని, నవీన్‌ నికోలస్‌ లు ఐఏఎస్‌ కేడర్‌ అధికారులుగా ఎంపికయ్యారు.

- Advertisement -

ఎంపికచేసిన 25 మంది అధికారుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపించింది. ఈ ఏడాది జనవరి నెలలో ఢిల్లీలో రాష్ట్ర అధికారులకు యూపీఎస్సీ ఇంటర్వ్యూలు నిర్వహించింది. ఇంటర్వ్యూ ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వానికి మంగళవారం పంపినట్టు తెలిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement