Thursday, March 28, 2024

భారత్ జోడో యాత్ర బాధ్యత నాకు అప్పగించారు : ఉత్తమ్ కుమార్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ యువనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేప‌ట్టిన విష‌యం విధిత‌మే. అయితే భారత్ జోడో యాత్ర‌ను సమన్వయం చేసే బాధ్యత తనకు అప్పగించారని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో రాహుల్ యాత్ర‌ను తానే పర్యవేక్షిస్తానని, ఆ విషయం గురించి మాట్లాడానికే ఏపీ నాయకులతో మాట్లాడటానికి విజయవాడ వచ్చానని పేర్కొన్నారు. అభివృద్ధి ఫలాలు దేశంలో అందరికీ అందాలని రాహుల్ గాంధీ యాత్ర మొదలు పెట్టార‌న్నారు. ఏపీలో కూడా అందరూ కలిసి ఈ యాత్రను విజయవంతం చేసేలా కలిసి రావాల‌న్నారు. చిన్న చిన్న అభ్యంతరాలు ఉన్నా అందరూ సర్దుకుని పనిచేయాల‌న్నారు. సమన్వయ లోపం ఉంటే వెంటనే నా దృష్టి కి తీసుకురండి అని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement